డాక్టర్ ఆనంద్ సేవలు అభినందనీయం: సీపీ సజ్జనార్
ABN , First Publish Date - 2021-02-27T21:14:22+05:30 IST
ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం, ఫిన్ బధిరుల సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని
హైదరాబాద్: ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం, ఫిన్ బధిరుల సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మలక్పేట్లో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఎన్జీవో సంస్థల సేవలను సజ్జనార్ కొనియాడారు. ముఖ్యంగా కోవిడ్ కష్ట కాలంలో ఎన్నో ఉచిత శిబిరాలను నిర్వహించడంతో పాటు, పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించారని.. ఆ సమయంలో వారి సేవలు మరువలేనివన్నారు. ప్రముఖ సామాజిక సంస్థ బంజారా మహిళా ఎన్జీవో వ్యవస్థాపకులు డాక్టర్ ఆనంద్ సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదిలా ఉంటే, చిన్నారులలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. స్వచ్ఛంద సంస్థల మరింత చైతన్యంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు జానకి, ఉప్పల శ్రీనివాస్ గుప్త, దేవి ప్రసాద్, బాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.