ఆహారంలో కరోనాపై భయం వద్దు: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-08-14T20:27:37+05:30 IST

ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు..

ఆహారంలో కరోనాపై భయం వద్దు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి సంబందించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను ఆధారంగా చూపింది. ఈ పరిశోధనలో కొన్ని లక్షల ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్‌లపై కరోనా పరీక్ష నిర్వహించారని, వాటిలో అత్యంత తక్కువ ప్యాకేజింగ్‌లపై మాత్రమే కరోనా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆహారం విషయంలో భయం అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ తెల్చి చెప్పింది.

Updated Date - 2020-08-14T20:27:37+05:30 IST