హైదరాబాద్‌లో వరల్డ్‌ జియోస్పేషియల్‌ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-10-03T09:18:10+05:30 IST

ఐక్యరాజ్య సమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న వరల్డ్‌ జియోస్పేషియల్‌ కాంగ్రె్‌సకు హైదరాబాద్‌ వేదిక కానుంది.

హైదరాబాద్‌లో వరల్డ్‌ జియోస్పేషియల్‌ కాంగ్రెస్‌

11న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 2: ఐక్యరాజ్య సమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న వరల్డ్‌ జియోస్పేషియల్‌ కాంగ్రె్‌సకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ప్రధాని మోదీ 11న అధికారికంగా సదస్సును ప్రారంభిస్తారు. అయితే అక్టోబరు 10నుంచి 14వ తేదీ వరకు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల నుంచి 550 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ సదస్సుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. జియోస్పేషియల్‌ రంగంలో భారత్‌ సాధించిన ప్రగతిని ఈ సదస్సులో చర్చిస్తారు. 

Updated Date - 2022-10-03T09:18:10+05:30 IST