‘మేటి క్రీడాకారిణి’గా సింధు
ABN , First Publish Date - 2020-02-21T10:07:16+05:30 IST
వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఈఎస్పీఎన్ ‘ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైంది. ఈ పురస్కారాన్ని సింధు గెలుచుకోవడం ఇది వరుసగా ...
హంపి, గోపీచంద్కు ఈఎస్పీఎన్ అవార్డులు
న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఈఎస్పీఎన్ ‘ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైంది. ఈ పురస్కారాన్ని సింధు గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. పురుషుల కేటగిరీలో యువ షూటర్ సౌరభ్ చౌదరికి ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసి వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి ‘కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపీ చంద్ ‘కోచ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నాడు. సింధు వరల్డ్ చాంపియన్గా నిలిచిన సందర్భాన్ని ‘మూమెంట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేశారు.