రూ.125 కోట్ల పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-20T06:40:03+05:30 IST
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రూ.125 కోట్లతో చేయనున్న 16 పనులకు సంబంధించి ముందుకు కదలాలని, ఇప్పటి వరకూ టెండర్లు ఖరారైన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.
- కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేల సమీక్ష
రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రూ.125 కోట్లతో చేయనున్న 16 పనులకు సంబంధించి ముందుకు కదలాలని, ఇప్పటి వరకూ టెండర్లు ఖరారైన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో గురువారం రాత్రి ఇంజనీరింగ్, పరిపాలనా అధికారులతో ఈ పనుల గురించి సమీక్షించారు. కాంట్రాక్టర్లు పనుల విషయంలో నాణ్యత పాటించడంతోపాటు సమయపాలన పాటించాలన్నారు. బిల్లుల చెల్లింపు సమస్య ఉండదని, కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని, అభివృద్ధి పనులు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ దినేషన్కుమార్ ఎస్ఈ జి.పాండురంగారావు, శేషగిరిరావు, ఎంవీ రాజారావు తదితరులు పాల్గొన్నారు.