‘నాడు-నేడు’ పనులను పర్యవేక్షించాలి
ABN , First Publish Date - 2021-04-17T05:14:53+05:30 IST
అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టనున్న నాడు-నేడు పనుల్లో అభివృద్ధి కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉండాలని ఎంపీడీవో జాన్మిల్టన్ సూచించారు.
గంగవరం, ఏప్రిల్ 16: అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టనున్న నాడు-నేడు పనుల్లో అభివృద్ధి కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉండాలని ఎంపీడీవో జాన్మిల్టన్ సూచించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో గంగవరం, అడ్డతీగల మండలాలకు చెందిన అంగన్వాడీ అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు జరిగాయి. ఎంపీడీవో కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. సీడీపీవో మాట్లాడుతూ గంగవరం మండలంలోని మూడు అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు రూ.5 లక్షల చొప్పున, కొత్త భవనానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యవతి, గృహనిర్మాణశాఖ, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.