‘నాడు-నేడు’ పనులు 95శాతం పూర్తి
ABN , First Publish Date - 2021-06-23T05:25:20+05:30 IST
మండలంలో ‘నాడు-నేడు’ పథకంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని కడియం ఎంఈవో వి.లజపతిరాయ్ తెలిపారు.
రంగంపేట, జూన్ 22: మండలంలో ‘నాడు-నేడు’ పథకంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని కడియం ఎంఈవో వి.లజపతిరాయ్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన ఆధ్వ ర్యంలో ఒక ప్రత్యేక బృందం మండలంలోని దొడ్డిగుంట, సింగంపల్లి, వడిశలేరు ఉన్నత పాఠశాలలతో పాటు కోటపాడు, సుభద్రంపేట, వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులను పరిశీలించింది. మిగిలిన పనులను ఈవారంలో పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సింగంపల్లి ఉన్నత పాఠశాలలో పనులను చూసి హెచ్ఎం మీర్జా ఆలీని అభినందించారు. హెచ్ఎంలు, ఎమ్మార్పీ దుర్గారావు పాల్గొన్నారు.