కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:35:40+05:30 IST

ప్రభుత్వం రద్దు చేసిన సర్క్యూలర్‌(1214) భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని

కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి
కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీఎన్‌టీయూసీ నాయకులు

కార్మిక శాఖ కమిషనర్‌కు టీఎన్‌టీయూసీ వినతి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 23: ప్రభుత్వం రద్దు చేసిన సర్క్యూలర్‌(1214) భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెంటపల్లి శ్యామ్‌, పార్లమెంట్‌ అధ్యక్షుడు సుంకర విష్ణుకుమార్‌ డిమాండ్‌ చేశారు.  విజయవాడలో కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ కార్తికేయ మిశ్రాను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం దారి మళ్లించి కార్మికుల పోట్టకొడుతుందన్నారు. మళ్లించిన నిధులను బోర్డులో జమ చేసి కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ నేతలు గోళ్ల శాంతిబాబు, తంగిరాల కొండలరావు, కూచిపూడి దిలీప్‌కుమార్‌, గరిమెళ్ల చిన్న, బురుసు శివ, పీరుబాబు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:35:40+05:30 IST