కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-05-23T08:39:52+05:30 IST

ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణతో పాటు కార్మిక చట్టాల్లో మార్పులను నిరసిస్తూ భెల్‌ హెచ్‌పీవీపీలో కార్మికులు శుక్రవారం

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికుల నిరసన

అక్కిరెడ్డిపాలెం: ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణతో పాటు కార్మిక చట్టాల్లో మార్పులను నిరసిస్తూ భెల్‌ హెచ్‌పీవీపీలో కార్మికులు శుక్రవారం కర్మాగారం మెయిన్‌గేటు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మిక నాయకులు ఉరుకూటి బాబూరావు, విజయ్‌కుమార్‌,  జీటీపీ ప్రకాష్‌, ఎస్‌.జగన్నాథరావు, కొల్లి దేముడు, మల్లేశ్వరరావు, సీతం నాయుడు, గండి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. షీలానగర్‌, అక్కిరెడ్డిపాలెంలో  జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (సిటూ) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జి.సుబ్బారావు, ఎం.రాంబాబు, గొలగాన అప్పారావు, ఎ.లోకేష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T08:39:52+05:30 IST