కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

ABN , First Publish Date - 2020-03-29T11:09:29+05:30 IST

లాక్‌డౌన్‌ రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైర్‌సను అరిక ట్టేందుకు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌

కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైర్‌సను అరిక ట్టేందుకు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరమైన కంపెనీలు, సంస్థలు మినహా మిగతావి పూర్తిస్థాయిలో మూసివేయాలని కార్మిక శాఖ ఇదివరలోనే ఆదేశాలిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో మూసి ఉన్న కంపెనీలు, సంస్థలలోని కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-03-29T11:09:29+05:30 IST