కార్మికులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-06-28T10:39:10+05:30 IST

కరోనా వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో శనివారం

కార్మికులను ఆదుకోవాలి

ఏలూరు కార్పొరేషన్‌, జూన్‌ 27 : కరోనా వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో శనివారం పాతబస్టాండ్‌ సెంటర్‌లో నిరసన  నిర్వహించారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలలపాటు చెల్లించాలని ఇఫ్ట్యూ నాయకుడు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలంతా బాధపడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు వేస్తూ పయనిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్యరంగానికి ఐదుశాతం నిధులు కేటాయించి కరోనాను అరిక ట్టేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్టూ నాయకులు కాకర్ల అప్పారావు, జనార్ధన్‌, గంగాధర్‌, రామయ్య, సత్యనారాయణ, శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-28T10:39:10+05:30 IST