విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-07-25T04:48:44+05:30 IST
నగర పంచాయతీ కడప రోడ్డులోని ఓ రీబటన్ టైర్ కంపెనీలో విద్యుత్ షాక్ తగిలి శాంతినగర్కు చెందిన తలారి నగేష్ (32) శనివారం మృతి చెందాడు.
ఎర్రగుంట్ల, జూలై 24: నగర పంచాయతీ కడప రోడ్డులోని ఓ రీబటన్ టైర్ కంపెనీలో విద్యుత్ షాక్ తగిలి శాంతినగర్కు చెందిన తలారి నగేష్ (32) శనివారం మృతి చెందాడు. రీబటన్ చేస్తుండగా ర్యాషింగ్ మోటార్ నుంచి విద్యుత్ సరఫరా జరిగి షాక్ కొట్టడంతో నగేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ క్రిష్ణయ్య విచారించి కేసు నమోదు చేశారు. సంఘటన కంపెనీలో జరిగిందని, తమకు ఎలాంటి సంబంధం లేదని డిస్కం ఏఈ సుబ్బారావు తెలిపారు.