విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:05:18+05:30 IST

మండలంలోని ఉయ్యాలవాడ గ్రామా నికి చెందిన గొల్ల రాజు (27) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందారు.

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

ఓర్వకల్లు, డిసెంబరు 5: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామా నికి చెందిన గొల్ల రాజు (27) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందారు. ఓ రైతు పొలంలో మోటారు కనెక్షన్‌ ఇవ్వడానికి కరెంటు పోల్‌ ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య, పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:05:18+05:30 IST