గెలుపే లక్ష్యంగా పనిచేయండి

ABN , First Publish Date - 2022-05-19T04:47:29+05:30 IST

టీడీపీ గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేయాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం చిన్ననారాయణపురంలో పర్యటించి, గ్రామస్థులతో మమేకమయ్యారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన ధరలతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయండి
వృద్ధురాలితో మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
టెక్కలి, మే 18:
టీడీపీ గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేయాలని శ్రీకాకుళం ఎంపీ  కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం చిన్ననారాయణపురంలో పర్యటించి, గ్రామస్థులతో మమేకమయ్యారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన ధరలతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. అన్నక్యాంటీన్‌, నిరుద్యోగ భృతి, ఎస్సీ, బీసీ, ఇతర కార్పొరేషన్లు ద్వారా  పథకాలు, విదేశీ చదువులకు ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. హామీలు గుప్పించడం, మభ్యపెట్టడం, ప్రజలు నెత్తిన భారం వేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తంచేశారు. వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆయన వెంట నాయకులు కింజరాపు హరిప్రసాద్‌, బగాది శేషగిరి, మెండ దాసునాయుడు, ఇప్పిలి జగదీష్‌, వాసు, ప్రీతీష్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి  ఉన్నారు.

Updated Date - 2022-05-19T04:47:29+05:30 IST