టీడీపీ బలోపేతానికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-09-19T04:09:21+05:30 IST

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

టీడీపీ బలోపేతానికి కృషిచేయాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌

గూడూరు, సెప్టెంబరు 18: టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతినెల వార్డు, గ్రామ, పట్టణ మండల స్థాయిలలో సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. పారీ ్టకోసం కష్టపడి పనిచేసే వారికి కమిటీల్లో సుముచితస్థానం కల్పిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్‌, మట్టం శ్రావణి, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లురాజు, అబ్దుల్‌ రహీం, జహంగీర్‌, మోహన్‌, కోటేశ్వరరావు, దుద్దా రాఘవరెడ్డి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:09:21+05:30 IST