వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-15T09:26:34+05:30 IST

సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ (స్టామ్‌ వాట ర్‌) నిర్మాణ పనులకు శుక్రవారం కార్పొరేటర్‌

వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ పనులు ప్రారంభం

బౌద్ధనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో వర్షపునీరు వెళ్లే పైపులైన్‌ (స్టామ్‌ వాట ర్‌) నిర్మాణ పనులకు శుక్రవారం కార్పొరేటర్‌ సామల హేమ శంకుస్థాపన చేశారు. రూ. 8.5 లక్షలతో ఈ పనులను చేపట్టారు. పనులు పూర్తైతే రోడ్లపై వర్షపునీరు నిల్వ ఉండదని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలనీలో మొక్కలను నాటా రు. కార్యక్రమంలో నాయకులు కరాటేర ాజు, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌, జీహెచ్‌ఏంసీ ఏఈ మధురిమ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T09:26:34+05:30 IST