అన్ని రంగాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-07-07T04:40:03+05:30 IST

అన్ని రంగాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో గల ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో రూ. 21,24,090 లతో చేపడుతున్న ప్రహరీ గోడ, నూతన భవనం, పెయింటింగ్‌, బోరు మోటారు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అన్ని రంగాల అభివృద్ధికి కృషి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 

బెల్లంపల్లి, జూలై 6 : అన్ని రంగాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో గల ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో రూ. 21,24,090 లతో  చేపడుతున్న ప్రహరీ గోడ, నూతన భవనం, పెయింటింగ్‌, బోరు మోటారు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గురుకులాలు, మోడల్‌ స్కూల్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, , ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీధర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని వైకుంఠదామం నిర్మాణ పనులను బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  ఎమ్మెల్యే వెంట జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ శ్వేతశ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, కమినర్‌ గంగాధర్‌,  కౌన్సిలర్‌ ఆస్మా ఉన్నారు.

Updated Date - 2022-07-07T04:40:03+05:30 IST