వరల్డ్‌కప్‌ @ 90 లక్షలు

ABN , First Publish Date - 2020-04-03T09:53:27+05:30 IST

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న జరిగిన టైటిల్‌ పోరును...

వరల్డ్‌కప్‌ @ 90 లక్షలు

భారత్‌లో మహిళల క్రికెట్‌కు బ్రహ్మరథం

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న జరిగిన టైటిల్‌ పోరును టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో కలిపి రికార్డు స్థాయిలో సుమారు 90 లక్షల మంది వీక్షించారట. ఈ వివరాలను ఐసీసీ గురువారం విడుదల చేసింది. టోర్నీలో హర్మన్‌సేన అదరగొట్టడంతో భారత్‌లో మొత్తంగా 540 కోట్ల నిమిషాలపాటు వీక్షించినట్టు తెలిపింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగిన టోర్నీ మ్యాచ్‌ల వీడియోలను వంద కోట్ల మందికి పైగా వీక్షించినట్టు చెప్పింది. 

Updated Date - 2020-04-03T09:53:27+05:30 IST