ఒంటరి మహిళపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-01-27T08:09:38+05:30 IST

లిఫ్ట్‌ ఇస్తానంటూ రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఓ మహిళను బైక్‌పై ఎక్కించుకున్న ఓ వ్యక్తి మార్గం మధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఖానాపూర్‌, కూచూరు గ్రామాల సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు....

ఒంటరి మహిళపై అత్యాచారం


జడ్చర్ల, జనవరి 26: లిఫ్ట్‌ ఇస్తానంటూ రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఓ మహిళను బైక్‌పై ఎక్కించుకున్న ఓ వ్యక్తి మార్గం మధ్యలో ఆమెపై అత్యాచారం చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఖానాపూర్‌, కూచూరు గ్రామాల సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట మండలంలోని ఓ గ్రామం నుంచి జడ్చర్ల మండలంలోని మరో గ్రామానికి  మంగళవారం రాత్రి ఓ మహిళ ఒంటరిగా వెళ్తోంది. నవాబ్‌పేట మండ లం కూచూరు గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి ఆమెను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. దారిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ మహిళ చెవికమ్మలు, మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-01-27T08:09:38+05:30 IST