కుటుంబ కలహాలు.. పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-29T17:38:25+05:30 IST

మదురైలో కుటుంబ సమస్యల కారణంగా పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మదురై పెరియార్‌ బస్టాండ్‌ సమీపంలో మేల్‌వాసల్‌ ప్రాంతానికి చెందిన పాండి అదే

కుటుంబ కలహాలు.. పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్య

చెన్నై : మదురైలో కుటుంబ సమస్యల కారణంగా పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మదురై పెరియార్‌ బస్టాండ్‌ సమీపంలో మేల్‌వాసల్‌ ప్రాంతానికి చెందిన పాండి అదే ప్రాంతానికి చెందిన తమిళ్‌సెల్వితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి వరణిశ్రీ(4), వర్నికాశ్రీ(2) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో గత రాత్రి వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన తమిళ్‌సెల్వి, ఇద్దరి పిల్లలతో పాటు తనపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, తమిళ్‌సెల్వి మదురై రాజాజీ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై దిడీర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-29T17:38:25+05:30 IST