విడాకుల విషయమై తల్లితో ఘర్షణ.. మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-05T13:03:16+05:30 IST

భర్తతో విడాకులు తీసుకున్న విషయంపై తల్లితో గొడవ పడిన

విడాకుల విషయమై తల్లితో ఘర్షణ.. మహిళ ఆత్మహత్య

హైదరాబాద్/మన్సూరాబాద్‌ : భర్తతో విడాకులు తీసుకున్న విషయంపై తల్లితో గొడవ పడిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జంపాల ధనమ్మ(20) ఎన్టీఆర్‌నగర్‌లో తల్లి, సోదరితో కలిసి నివసిస్తోంది. రెండేళ్ల క్రితం ఆమెకు వివాహం కాగా భర్త నుంచి విడాకులు తీసుకుంది.


అప్పటి నుంచి మానసికంగా బాధపడుతోంది. సోమవారం ఉదయం కూలిపని కోసం తల్లితోపాటు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎన్టీఆర్‌నగర్‌ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ విడాకులు, పలు విషయాలపై తల్లి లక్ష్మమ్మతో ధనమ్మకు చిన్నపాటి గొడవ జరిగింది. మార్కెట్‌ నుంచి ఇంటికి వచ్చిన ధనమ్మ ఇంట్లో చున్నీతో ఇనుపరాడ్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన సోదరి ధనమ్మ ఉరేసుకోవడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-05T13:03:16+05:30 IST