నల్గొండ : పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-12T15:58:24+05:30 IST

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు

నల్గొండ : పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ సిబ్బంది మూడు షాపులను తొలగించింది. అయితే ఎలాంటి నోటీసులు కానీ సమాచారం ఇవ్వకుండానే తొలగించడంతో ఆ షాపులపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఆధారం లేకుండా పోయింది. ఎందుకిలా చేస్తున్నారు..? నోటీస్ లేకుండా తొలగిస్తారా..? అని సిబ్బందిని అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా ఈ షాపుల పైనే ఆధారపడిన తమకు జీవనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-12T15:58:24+05:30 IST