వేధింపులతో మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-26T06:04:06+05:30 IST

మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామంలో సోమవారం అత్తింటి వేధింపులు తాళలేక బోయ బీసుపల్లి శ్రావణి (28) అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వేధింపులతో మహిళ ఆత్మహత్య

మంత్రాలయం, జనవరి 25: మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామంలో సోమవారం అత్తింటి వేధింపులు తాళలేక బోయ బీసుపల్లి శ్రావణి (28) అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ కృష్ణయ్య, మృతురాలి తల్లిదండ్రులు జయన్న, శంకరమ్మ తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్‌ సి.బెళగల్‌ మండలం ఇనగండ్ల గ్రామానికి చెందిన  జయన్న, శంకరమ్మల కుమార్తె బీసుపల్లి శ్రావణిని ఇచ్చి గత పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల భర్త వెంకటేశ్‌, అత్త జయమ్మ, బావ సురేష్‌  వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు అధికం కావడంతో శ్రావణి సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈవిషయం తెలుసుకున్న సీఐ వెంటనే  సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మెరకు భర్త, అత్త,  బావలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.  


Updated Date - 2021-01-26T06:04:06+05:30 IST