ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-05T16:01:29+05:30 IST
హైదరాబాద్: ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టేందుకు కుంకుమ భరణి చేతులోకి తీసుకోగానే అది చేతులో నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తనకు ఆయుష్షు మూడిందని భావించిన ఆ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్ చేసి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.