HYD: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-01T15:56:09+05:30 IST

అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన జబియా(21) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని

HYD: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

హైదరాబాద్/చంపాపేట: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన జబియా(21) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు బాబు(1) ఉన్నాడు. అత్త షహజా (60), భర్త ముక్తార్‌(26)వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి మహ్మద్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కంచన్‌బాగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-11-01T15:56:09+05:30 IST