నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం
ABN , First Publish Date - 2020-04-27T14:22:16+05:30 IST
నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం బయటపడటంతో పహాడిషరీఫ్ ప్రాంతంలో కలకలం రేగింది.
హైదరాబాద్/పహాడిషరీఫ్ : నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం బయటపడటంతో పహాడిషరీఫ్ ప్రాంతంలో కలకలం రేగింది. పహాడిషరీఫ్ నుంచి మామిళ్లపల్లి వెళ్లేదారిలో ఇందుటెక్ కంపెనీ కాంపౌండ్ లోపల గల నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం కనిపించింది. చాలాకాలం కావడంతో పుర్రె, వెన్నుపూస, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఘటనాస్థలంలో నలుపురంగు బురఖా, నలుపు తెలుపు చుక్కలున్న చున్నీ, నలుపురంగు చెప్పులు ఉన్నాయి. ఘటన జరిగి మూడు నెలలు అయి ఉంటుందని భావిస్తున్నారు. మామిడిపల్లి వీఆర్ఏ కోట్ల వీరస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.