మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , First Publish Date - 2022-08-13T05:24:10+05:30 IST
తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి అర్బన్, ఆగస్టు 12: తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రక్షాబంధన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డికి ఆయన సోదరీమణులు అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ, శశిరేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు, సర్పంచులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. మహిళల శక్తిని ఎంత సద్వినియోగపరుచుకుంటే సమాజం అంత పురోగమి స్తుందన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని, అన్ని వర్గాలకు సామాజిక, సాం ఘీక, ఆర్థిక భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల అనుబంధం మాత్ర మే కాదని, సమాజంలో ఉన్న ప్రతీ మహిళను, ప్రతీ శిశువును గౌరవించడమే కాకుండా కొలవడం మన సంస్కృతి సాంప్రదాయం అన్నారు.