మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మేయర్
ABN , First Publish Date - 2021-03-07T05:17:39+05:30 IST
మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలని నగర మేయర్ దండు నీతూ కిరణ్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ అర్బన్, మార్చి 6: మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలని నగర మేయర్ దండు నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించిన అంత ర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతి థిగా హాజరై వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మ హిళలు అన్ని రంగాల్లో రాణించినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతీమహిళ దైర్యంగా ముందెకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాలాది విజ య, ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిమరాజ్, ఇందూరు యు వత అధ్యక్షుడు సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.