రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-17T06:31:03+05:30 IST

రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి
హుకుంపేటలో నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కిడారి, తదితరులు


మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌

హుకుంపేట, మే 16: రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం ఇక్కడ నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం మహిళలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిందన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు సాగర సత్యవతి. సిరగం సూర్యాకాంతం, సాగర వసంతకుమారి, కొమ్మా రమా, నేతలు శెట్టి లక్ష్మణుడు, బాకూరు వెంకటరమణరాజు, సాగర సుబ్బారావు, శశిభూషణ్‌, కామేశ్వరరావు, తలసీరావు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-05-17T06:31:03+05:30 IST