స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి

ABN , First Publish Date - 2020-11-28T05:21:48+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతోపాటు మహిళలందరిని ఇందులో భాగస్వాములు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు సూచించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి
మాట్లాడుతున్న కమిషనర్‌ వల్లూరి క్రాంతి

20లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి 

 నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 27: స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతోపాటు మహిళలందరిని ఇందులో భాగస్వాములు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆర్పీ, పీఆర్పీలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది కరీంనగర్‌ నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షన్‌లో 72వ ర్యాంకును సాధించగా ఆసారి 20లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీపై మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వడం, ఇళ్లలో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని డంపింగ్‌యార్డుకు చెత్త తగ్గించేందుకు కృషిచేయడం, ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా జ్యూట్‌ బ్యాగులను, బట్టసంచులను, టిఫిన్‌ బాక్సులను వినియోగించడం వంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎన్విరాన్‌మెంటల్‌ అధికారి స్వామి, టీటీసీ నిర్వాహకులు కరుణాకర్‌, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత, సీడీలు పద్మ, తిరుపతి, దీప పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:21:48+05:30 IST