మీ చెల్లి నన్ను నమ్మించి మోసం చేసిందంటూ షాకింగ్ నిజాలు చెప్పిన బావ.. చెల్లిని వెతుక్కుంటూ వెళ్లిన ఆ సోదరులకు..

ABN , First Publish Date - 2021-10-12T12:36:07+05:30 IST

ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఒక్కోసారి...

మీ చెల్లి నన్ను నమ్మించి మోసం చేసిందంటూ షాకింగ్ నిజాలు చెప్పిన బావ.. చెల్లిని వెతుక్కుంటూ వెళ్లిన ఆ సోదరులకు..

ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఒక్కోసారి ఎంతవరకూ దారి తీస్తాయో ఎవరూ ఊహించలేరు. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రాష్ట్రరాజధాని భోపాల్ పరిధిలోని గుణ ప్రాంతంలో ప్రేమికునితో ఒక వివాహిత పారిపోయింది. ఆ వివాహిత సోదరులు ఆ ప్రేమికుని తల్లిని దారుణంగా హత్యచేశారు. పని కోసం అశోక్‌నగర్ వెళ్లిన భార్య అటునుంచి అటే ప్రియునితో పారిపోయింది. ఆ మహిళ సోదరులు ప్రియుడి ఇంటికోసం తీవ్రంగా గాలించారు. 


ఆ ఇంటిలో ప్రేమికుడు దొరకలేదు. అతని తల్లి ఉంది. దీంతో ఆ సోదరులు మంచంకోళ్లు తీసుకొని ప్రేమికుని తల్లిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు అర్ధరాత్రి నిందితులను అరెస్టు చేశారు. గుణ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో గల ధమ్నార్ గ్రామానికి చెందిన ఆ మహిళకు కుల్హాడీ గ్రామానికి చెందిన యువకునితో వివాహమయ్యింది. అయితే ఆ మహిళ ఆరోన్‌కు చెందిన మరో యువకుడిని ప్రేమిస్తోంది. ఒకరోజు ఆ మహిళ భర్తతో పాటు పనికోసం అశోక్‌నగర్ వెళ్లింది. తన ప్రియుడు గోలూ ఓఝాను అక్కడకు రమ్మని ఆమె కోరింది.


అక్కడ భర్త కళ్లుగప్పి ఆమె ప్రియునితోపాటు వెళ్లిపోయింది. ఆమె భర్త ఈ విషయాన్ని తన భార్య సోదరులకు తెలియజేశాడు. దీంతో వారు ప్రేమికుని ఇంటిని కనుగొన్నారు. అక్కడ ఆ ప్రేమికుని తల్లి అమర్ బాయి(45) మాత్రమే ఉండటంతో ఆమెను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అమర్ బాయి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించారు. నిందితులను చందేల్ సింగ్ ఓజా, లాలూ సింగ్ ఓఝాలుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-12T12:36:07+05:30 IST