మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ABN , First Publish Date - 2021-01-19T06:41:07+05:30 IST
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి
నిర్మల్ అగ్రికల్చర్, జనవరి 18 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో అజీవక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజనపథకంలో మంజూరైన ఖానాపూర్ మం డలానికి చెందిన పలువురికి మండల సమాఖ్య ద్వారా మంజూరైన ఆటో లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.