మహిళలు విద్యావంతులు కావాలి
ABN , First Publish Date - 2021-10-19T06:05:34+05:30 IST
మహిళలందరూ విద్యావంతులైననాడే ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని వాటిని వినియోగించుకోగలరని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 18: మహిళలందరూ విద్యావంతులైననాడే ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని వాటిని వినియోగించుకోగలరని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 69వ వార్డు తుంగ్లాంలో సోమవారం జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా సంఘాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కిందని, వీటన్నింటిని మహిళలు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశానికి వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అధ్యక్షత వహించగా, గాజువాక జోనల్ కమిషనర్ బి.శ్రీధర్, వార్డు నాయకులు బోగాది సన్యాసిరావు, ఈగలపాటి యువశ్రీ, కొల్లి కుంచారావు, కాకి అప్పలరెడ్డి, మజ్జి రాజు, కె.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు