మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
ABN , First Publish Date - 2021-06-23T05:22:57+05:30 IST
మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని అందు కోసం వైఎ్సఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
జమ్మలమడుగు రూరల్, జూన్ 22: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని అందు కోసం వైఎ్సఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గంగులయ్య, మండల మహిళా సమాఖ్య అధికారి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని వైఎ్సఆర్ చేయూత చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎ్సఆర్ చేయూత ద్వారా 1390 మందికి ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వేల్పుల శివమ్మ, కౌన్సిలర్లు ముల్లాజానీ, బేపారి షామీర్, సింగరయ్య, తదితరులు పాల్గొన్నారు.