బార్లో స్వీపర్గా పని చేస్తున్న వివాహిత అదృశ్యం
ABN , First Publish Date - 2021-03-01T12:58:49+05:30 IST
స్వగ్రామానికి వెళుతున్నట్లు చెప్పి బయలు దేరిన మహిళ
హైదరాబాద్/చంపాపేట : స్వగ్రామానికి వెళుతున్నట్లు చెప్పి బయలు దేరిన మహిళ రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. ఐఎ్ససదన్ డివిజన్ సింగరేణికాలనీలో నివాసం ఉంటున్న జమిని లక్ష్మి(35) స్థానికంగా ఓ బార్లో స్వీపర్గా పని చేస్తోంది. గత నెల 25న ఆమె చంపాపేటలో ఉన్న చెల్లెలు మాధవి ఇంటికి వచ్చింది. 26న మహబూబ్నగర్ వెళ్లేందుకు మందమల్లమ్మ రోడ్లో ఆరాంఘర్ వెళ్లే బస్సు ఎక్కింది. రాత్రి గడిచినా ఆమె ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మాధవి ఆదివారం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.