నేటినుంచి కడపలో అంతర్రాష్ట్ర మహిళల వన్డే టోర్నీ
ABN , First Publish Date - 2020-02-19T10:46:09+05:30 IST
బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-19 అంతర్రాష్ట్ర మహిళల వన్డే టోర్నమెంట్కు కడపలోని
కడప (ఆంధ్రజ్యోతి): బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-19 అంతర్రాష్ట్ర మహిళల వన్డే టోర్నమెంట్కు కడపలోని వైఎస్ఆర్, ఏసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. బుధవారం నుంచి జరిగే ఈ టోర్నీలో పది రాష్ర్టాల జట్లు అరుణాచల్ ప్రదేశ్, బిహార్, నాగాలాండ్, జమ్మూ కశ్మీర్, సిక్కిం, చండీగఢ్, మిజోరం, మణిపూర్, మేఘాలయ, పుదుచ్చేరి పాల్గొంటున్నాయి. మొత్తం మూడు మైదానాల్లో 45 మ్యాచ్లు జరగనున్నాయి.