స్టౌ వద్ద మంటలు అంటుకుని మహిళకు గాయాలు

ABN , First Publish Date - 2022-09-25T04:57:22+05:30 IST

పాలుకాచే క్రమంలో గ్యాస్‌ లీకై మంటలు అంటుకుని మహిళ తీవ్రంగా గాయ పడిన ఘటన వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో శనివారం చోటుచేసుకుంది.

స్టౌ వద్ద మంటలు అంటుకుని మహిళకు గాయాలు
ప్రమాదంలో గాయపడిన రాజేశ్వరి

వెదురుకుప్పం, సెప్టెంబరు 24: పాలుకాచే క్రమంలో  గ్యాస్‌ లీకై మంటలు అంటుకుని మహిళ తీవ్రంగా గాయ పడిన ఘటన వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో శనివారం చోటుచేసుకుంది. పెరుమాళ్లపల్లెకు చెందిన రాజేశ్వరి(55) ఉదయం గ్యాస్‌ స్టౌపై పాలు వేడి చేస్తుండగా పొంగు పైపుపై పడింది. పైపు కాలిపోయి గ్యాస్‌ లీకైంది. వెంటనే మంటలు అక్కడే ఉన్న రాజేశ్వరికి అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు వచ్చి అదుపు చేశారు. అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడింది. వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.

Updated Date - 2022-09-25T04:57:22+05:30 IST