విద్యుత్‌ షాక్‌ గురై మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-30T06:18:45+05:30 IST

శాంతిపురం మండలం బోయనపల్లెలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది.

విద్యుత్‌ షాక్‌ గురై మహిళ మృతి
యల్లమ్మ మృతదేహం

శాంతిపురం, నవంబరు 29: శాంతిపురం మండలం బోయనపల్లెలో విద్యుత్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది. రాళ్లబూదగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ కథనం మేరకు.. బోయనపల్లెకు చెందిన జయప్ప భార్య ఎల్లమ్మ(52) ఆదివారం ఉదయం ఇంట్లోని సంపులో నీరు నింపేందుకు ప్రభుత్వ కొళాయికి మో టారు పైపు అమర్చింది. మోటారు ఆన్‌ చేసింది. అది రన్‌కాకపోవడంతో దాన్ని చెక్‌ చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-30T06:18:45+05:30 IST