మహిళల క్రికెట్ సెలెక్షన్
ABN , First Publish Date - 2020-09-27T09:35:16+05:30 IST
భారత జట్టు మాజీ లెఫ్టామ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా నియమితురాలైంది
కమిటీ చైర్మన్గా నీతూ డేవిడ్
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ లెఫ్టామ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా నియమితురాలైంది. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది. హేమలతా కళ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. మిథు ముఖర్జీ, రేణు మార్గరెట్, ఆరతి వైద్య, వి.కల్పనతో కూడిన కమిటీకి నీతూ చీఫ్గా వ్యవహరించనుంది.