HYD : పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళా కార్పొరేటర్ల భర్తలు
ABN , First Publish Date - 2021-12-20T14:24:26+05:30 IST
గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న రిసార్ట్పై
- రూ. 65,610 స్వాధీనం.. ఏడుగురిపై కేసు
హైదరాబాద్ సిటీ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న రిసార్ట్పై మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు దాడి చేశారు. జవహర్నగర్ మునిసిపాలిటీ పరిధిలో ఓ మహిళా కార్పొరేటర్ భర్తతోపాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని రస్టిక్ ఓగ్ రిసార్ట్లో పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం దాడి చేశారు. మనోధర్రెడ్డి, మారగోని వెంకటేశ్గౌడ్, బల్లి శ్రీనివాస్, బుర్క రమేశ్, అందే సురేశ్, తాడూరి నరేశ్, కమ్లికర్ రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 65,610, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ప్లేయింగ్ కార్డుల సెట్స్ స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం... సెక్షన్ 3, 4, 5 కింద కేసు నమోదు చేశామని కీసర పోలీసులు తెలిపారు.