పిల్లలు పుట్టరని.. మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T04:53:08+05:30 IST

పిల్లలు పుట్టరనే బాధ తో కృష్ణానదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నారాయ ణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

పిల్లలు పుట్టరని.. మహిళ ఆత్మహత్య
జమున (ఫైల్‌)

కృష్ణ, అక్టోబరు 19 : పిల్లలు పుట్టరనే బాధ తో కృష్ణానదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నారాయ ణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు కథనం ప్రకారం.. మండల కేం ద్రానికి చెందిన బర్మా రెడ్డికి ఒకటిన్నర సంవత్సర క్రితం కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌ జిల్లాకేంద్రానికి చెందిన జమున అలియాస్‌ పవిత్ర(25)తో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం ఆమె గర్భం దాల్చింది. అనంతరం గర్భస్రావం కావడంతో తనకు పిల్లలు పుట్టరని సోమవారం కృష్ణానదిలో దూకుతుండగా గమనించిన మత్స్యకారుడు ఆమెను ఒడ్డుకు పంపించాడు. అ నంతరం ఆమె గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలో దూకింది. మత్స్యకారుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు కృష్ణానదిలో వెతకగా మంగళవా రం మృతదేహం తేలడంతో పోలీసులు పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమున కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. 

Updated Date - 2021-10-20T04:53:08+05:30 IST