చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్‌ నోటీసులు

ABN , First Publish Date - 2022-04-23T00:50:03+05:30 IST

చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్‌ నోటీసులు

చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్‌ నోటీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేత బోండా ఉమాకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి పరామర్శ సమయంలో వాగ్వాదం జరిగింది.


వార్తలోకి వెళ్తే..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి ఇల్లు కట్టి ఇస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. బాధితురాలి తల్లికి తగిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని జోగి రమేష్‌ సూచించారు.



విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఓ ఉద్యోగి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి రప్పించి ఓ చిన్న గదిలో ఉంచాడు. ఆ యువకుడు, తోటి ఉద్యోగి, ఉద్యోగి స్నేహితుడు ముగ్గురూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2022-04-23T00:50:03+05:30 IST