పోలీసులపై మహిళల దాడి

ABN , First Publish Date - 2021-01-16T04:51:19+05:30 IST

జూద గృహంపై దాడిచేసిన సపోలీసులపై మహిళలు దాడి చేయగా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప తెలిపారు.

పోలీసులపై మహిళల దాడి

  • 12 మందిపై కేసు నమోదు 
  • దువ్వూరు, జనవరి 15: జూద గృహంపై దాడిచేసిన సపోలీసులపై మహిళలు దాడి చేయగా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప తెలిపారు. మాచనపల్లెలో సంక్రాంతి పండుగ రోజున ఓ ఇంట్లో జూదం ఆడుతున్నా రన్న సమాచారం అందింది. దీంతో దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు సీపీఓలతో కలిసి దాడి చేశారు. దీంతో జూదం ఆడుతున్న వారు తాము కుటుంబ సభ్యులము మాత్రమే ఆడుతున్నామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై మహిళలు పలువురు పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఎస్‌ఐ కుళాయప్ప పేర్కొన్నారు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు ప్రతాప్‌రెడ్డి, మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-16T04:51:19+05:30 IST