నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నమహిళకు Covid possitive
ABN , First Publish Date - 2021-12-30T17:22:14+05:30 IST
ఇండోర్ విమానాశ్రయంలో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న మహిళకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది...
ఇండోర్: ఇండోర్ విమానాశ్రయంలో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న మహిళకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో సదరు మహిళను దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నామని అధికారులు చెప్పారు.ఇప్పటికే వివిధ దేశాల్లో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న సుమారు 30 ఏళ్ల మహిళకు ఇండోర్ విమానాశ్రయంలో పరీక్షలు చేయగా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో మహిళను ఆసుపత్రిలో చేర్చారు. కరోనా సోకిన మహిళకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. మహిళకు ఒక రోజు ముందు జరిపిన పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భూరే సింగ్ సెటియా చెప్పారు.
కరోనా వచ్చిన మహిళ 12 రోజుల క్రితం ఇండోర్కు వచ్చింది. ఇండోర్ నుంచి దుబాయ్కి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ఆమెకు కొవిడ్-19 సోకింది.జనవరి-ఆగస్టు మధ్య కాలంలో మహిళ నాలుగు డోస్ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యాధికారులు వివరించారు.