ఏడాది క్రితం పెళ్లి.. మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందంటూ ఫోన్..
ABN , First Publish Date - 2020-07-10T19:07:41+05:30 IST
పీటీఎం మండలం బండమీదపల్లెలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కందుకూరు పంచాయతీ గొల్లపల్లెకు
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
హత్య చేశారంటున్న మృతురాలి తండ్రి
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు): పీటీఎం మండలం బండమీదపల్లెలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కందుకూరు పంచాయతీ గొల్లపల్లెకు చెందిన వసంతకు బండమీదపల్లెకు చెందిన తంబళ్ల వెంకటేష్తో ఏడాది క్రితం వివాహమైంది. ఇదిలా ఉండగా వసంత గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందినట్టు పుట్టింటి వారికి అత్తింటి వారు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బండమీదపల్లెకు వచ్చి లబోదిబోమన్నారు. తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఎస్ఐ సుబ్బారెడ్డి, ములకలచెరువు సీఐ సురేష్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.