పిల్లలు కలగలేదని మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-28T17:15:06+05:30 IST
పెళ్లై ఏడాదైనా సంతానం కలగలేదని మనోవేధనకు గురైన ఓ మహిళ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పోలీసులు తెలిపిన
హైదరాబాద్/బాలానగర్: పెళ్లై ఏడాదైనా సంతానం కలగలేదని మనోవేధనకు గురైన ఓ మహిళ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పంచశీల కాలనీలో బీహార్కు చెందిన రామ్మోహ, ఆశ(19) నివసిస్తున్నారు. వీరికి ఏడాది క్రితం వివాహ మైంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వలసవచ్చి. రామ్మెహా తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. పెళ్లై సంవత్సరం కావస్తున్నా పిల్లలు కలగలేదని, దీంతో మనోవేధనకు గురైన ఆశ బుధవారం ఉదయం భర్త పనికెళ్లగానే ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన అతడు భార్య ఎంతకూ తలుపు తీయకపోవడంతో ఇంటి యజమాని అబ్దుల్ హనీఫ్ సహాయంతో తలుపులు విరగగొట్టి లోపలికెళ్లాడు. కానీ అప్పటికే ఆశ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. ఆశ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.