వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T05:05:16+05:30 IST
మండలంలోని వేగూరులో శనివారం రాత్రి భర్త వేధింపుల్ని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
కోవూరు, అక్టోబరు16: మండలంలోని వేగూరులో శనివారం రాత్రి భర్త వేధింపుల్ని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వేగూరు మజరా కండ్రిగ దళిత కాలనీకి చెందిన తాళ్లపాక లక్ష్మయ్య నిత్యం మద్యం తాగి అనుమానిస్తూ వేధిస్తుండటంతో తట్టుకోలేక అతడి భార్య తాళ్లపాక శైలజ (33) ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఆమె తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఎస్ఐ డీ వెంకటేశ్వరరావు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శైలజ మృతి సమాచారంతో కండ్రిగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.