స్నేహితురాలిని చంపి.. రాత్రంతా మృతదేహం పక్కనే జాగారం.. చెడు స్నేహం వల్ల వచ్చిన తిప్పలివి.. చివరకు ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-09-09T21:46:24+05:30 IST
భర్త చనిపోవడంతో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది.. కొద్ది రోజుల క్రితం వేరే మహిళతో పరిచయం పెంచుకుని స్నేహితురాలిగా మారింది..
భర్త చనిపోవడంతో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది.. కొద్ది రోజుల క్రితం వేరే మహిళతో పరిచయం పెంచుకుని స్నేహితురాలిగా మారింది.. ఆ మహిళ బాయ్ఫ్రెండ్ను ఆకట్టుకుంది.. చివరకు ఆ మహిళను కడతేర్చి ఆమె బాయ్ఫ్రెండ్ను తన వాడిగా చేసుకోవాలని ప్లాన్ వేసింది.. స్నేహితురాలిని గొంతు నులిమి చంపేసింది.. రాత్రంతా మృతదేహం పక్కనే ఉండి జాగారం చేసింది.. తర్వాతి రోజు ఉదయం వేరే ఊరికి పారిపోతూ మద్యం మత్తులో తన స్నేహితుడికి విషయం మొత్తం చెప్పేసింది.. అతడు పోలీసులకు సమాచారం అందించడంతో కటకటాల పాలైంది.. రాజస్థాన్ (Rajasthan)లోని పాలిలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
తెలివి తేటలుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు.. ఇప్పటికే రూ.2 కోట్ల ఆస్తి ఎలా సాధ్యమయిందంటే..
పాలికి చెందిన జ్యోతి (32), అనురాధ (36) చాలా రోజులుగా స్నేహితులు. భర్త చనిపోవడంతో అనురాధ ఒంటరిగా ఉంటోంది. జ్యోతి ఓ ఫైనాన్షియర్తో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే ఆ ఫైనాన్షియర్ అనురాధతో కూడా స్నేహం చేయడం మొదలుపెట్టాడు. జ్యోతితో కాకుండా అనురాధతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ విషయం గ్రహించిన జ్యోతి తన బాయ్ఫ్రెండ్ను హెచ్చరించింది. ఆ విషయం తెలుసుకున్న అనురాధ.. జ్యోతిపై ఆగ్రహం పెంచుకుంది. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం జ్యోతి ఇంటికి అనురాధ వెల్లింది. అక్కడ చాలాసేపు జ్యోతి, అనురాధ మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు జ్యోతిని అనురాధ గొంతుకోసి హత్య చేసింది. ఆ రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే గడిపింది.
తర్వాతి రోజు ఉదయం లేచి అహ్మదాబాద్ పారిపోవాలని నిర్ణయించుకుంది. మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ దగ్గర ఆగి మద్యం సేవించింది. ఆ మద్యం మత్తులో తన స్నేహితుడికి ఫోన్ చేసింది. తను చేసిన నిర్వాకం గురించి అతడికి చెప్పేసింది. భయపడిన అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి అనురాధను అరెస్ట్ చేశారు. జ్యోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్కు తరలించారు.