పెళ్లికి రెడీ అవుతున్న వరుడు.. అంతలో ఒక యువతి వచ్చి అందరి ముందు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-05-31T10:34:15+05:30 IST

ఒక యువకుడు ఒక యవతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి ఉండాలని మూడేళ్లు సహజీవనం చేశాడు. ఆ తరువాత ప్రియురాలు పెళ్లి చేసుకుందామని అడిగితే.. నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అతను మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడని తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతని పెళ్లి జరుగుతోంది...

పెళ్లికి రెడీ అవుతున్న వరుడు.. అంతలో ఒక యువతి వచ్చి అందరి ముందు ఏం చేసిందంటే..

ఒక యువకుడు ఒక యవతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి ఉండాలని మూడేళ్లు సహజీవనం చేశాడు. ఆ తరువాత ప్రియురాలు పెళ్లి చేసుకుందామని అడిగితే.. నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అతను మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడని తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతని పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ముస్తాబవుతున్న యువకుడిని అందరి ముందు అతని ప్రేయసి చితకబాదింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. జష్పూర్ జిల్లాకు చెందిన కళావతి(30, పేరు మార్చబడినది) మూడేళ్లుగా సురేంద్ర కుమార్ అనే  యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల కళావతి గర్భవతి అయింది. దీంతో ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుందామని అనుకుంది. ఈ విషయం సురేంద్రతో చెప్పగా.. అతను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. పైగా సురేంద్ర ఆమెను అబార్షన్ చేయించుకోవాలని అన్నాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 


ఒకరోజు కళావతికి.. సురేంద్ర మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది. ఆమె వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి సురేంద్ర తనను మోసం చేసి మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సురేంద్రను అరెస్టు చేయడానికి వెళ్లారు. అక్కడ సురేంద్ర వరుడిగా ముస్తాబవుతున్నాడు. కళావతి ఒక్కసారిగా అతని వద్దకు వెళ్లి.. అందరి మందు చితకబాదింది. ఆ తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-05-31T10:34:15+05:30 IST