పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ
ABN , First Publish Date - 2022-01-09T15:36:57+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని మధుర పోలీస్ స్టేషన్ ఎదుట ఒక మహిళ (30) ఒంటికి నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంతో బాధిత మహిళ 70 శాతం మంటల్లో కాలిపోయిందని పోలీసులు తెలిపారు..
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని మధుర పోలీస్ స్టేషన్ ఎదుట ఒక మహిళ (30) ఒంటికి నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంతో బాధిత మహిళ 70 శాతం మంటల్లో కాలిపోయిందని పోలీసులు తెలిపారు. నిప్పంటిచుకున్న మహిళను అగ్ని ఆర్పే దుప్పటితో కప్పి రక్షించే ప్రయత్నం చేసినట్లు మధుర పోలీసులు తెలిపారు. తొలుత ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించామని అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి మార్చినట్లు మధుర ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. బాధితురాలు జ్ణాని దేవి అని, మధురకు చెందిన సతిష్ అనే వ్యక్తి భార్య అని గుర్తించినట్లు ఆయన తెలిపారు. అయితే దేవి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని గౌరవ్ గ్రోవర్ తెలిపారు.